ప్రధాని నరేంద్రమోదీ డీమోనిటైజేషన్ పై ప్రజలనుద్దేశించి డిసెంబర్ 30న ప్రసంగించనున్నారు. ఇందులో మోదీ బ్యాంకులు నుంచి నగదు పరిమితి ఏటీఎం విత్ డ్రాలను సడలించనున్నారని ప్రస్తుతం నిబంధనల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేలా ప్రధాని ప్రకటన చేయనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతమున్న రోజుకు రూ.2,500, వారానికి రూ.24,000 పరిమితిని సడలించి, రోజుకు రూ.4000, వారానికి రూ.40,000 తీసుకునేలా ప్రకటన ఉండబోతున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం.ప్రధాని ఆ రోజు రాత్రి 8 గంటలకు రూ.500, రూ.1000 నోట్లను రద్దు ద్రవ్య పరిస్థితిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి తనకు 50 రోజులు గడువు కావాలని అలాగే నగదు కొరత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో డిసెంబర్ 22న కొత్త రూ.500, రూ.2000 నోట్ల ప్రింటింగ్ కు టెండర్లు వేయనున్నారని తెలుస్తోంది.

No comments:
Post a Comment