Wednesday, December 7, 2016

రాష్ట్ర‌ప‌తి సాహ‌సం

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత అంత్య‌క్రియ‌ల‌కు స‌మ‌యానికి చేరుకోవ‌డానికి రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ సాహ‌స‌మే చేశారు. బోయింగ్ 737 ల‌గ్జ‌రీ ప్లేన్ లో చెన్నైకి చేరుకున్న ప్ర‌ణ‌బ్‌.. అక్క‌డి నుంచి ఎయిర్‌ఫోర్స్ వాళ్లు ర‌వాణ‌కు వినియోగించే ఎంఐ-17 హెలికాప్ట‌ర్‌లో మెరీనా బీచ్‌కు వెళ్లారు. ఇందులో బోయింగ్‌లాగా ల‌గ్జ‌రీ సీట్లు ఉండ‌వు. దీంతో ప్ర‌ణ‌బ్ ఓ బెంచ్‌పై సీట్ బెల్ట్ పెట్టుకొని ప్ర‌యాణించారు. అంత‌కుముందు ఢిల్లీ నుంచి చెన్నై రావ‌డానికి మొద‌ట ప్ర‌ణ‌బ్ బ‌య‌లుదేరినా.. విమానంలో సాంకేతిక లోపం కార‌ణంగా బ‌య‌లుదేరిన కొద్దిసేప‌టికే మ‌ళ్లీ ఢిల్లీ వెళ్లిపోయారు. 

No comments:

Post a Comment