పవర్స్టార్ పవన్ కాళ్యాణ్ అందాల తార శృతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కిషోర్కుమార్ పార్థసారధి శర వేగంగా తీస్తున్నారు అభిమానులు, సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ దాదాపుగా ఖరారైనట్లే తెలుస్తోంది.షూటింగ్ అనుకున్నవిధంగా జరిగితే వచ్చే ఏడాది మార్చిలో ఉగాది కానుకగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలాచిలో షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం ఇస్తున్నారు. కిషోర్కుమార్ పార్థసారధి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది.

No comments:
Post a Comment