ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ముంబై టెస్టులో కొన్ని అరుదైన రికార్డులు నమోదు చేసుకున్నాడు. వాంఖడేలో ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన ఈ యంగ్ కెప్టెన్ అత్యధిక పరుగులు (235) చేసిన భారత కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. అంతకు ముందు ధోనీ ఆస్ట్రేలియాపై 2013లో 224 పరుగులు, 1999లో సచిన్ న్యూజిలాండ్పై 217 పరుగులు, సునీల్ గావస్కర్ 1978లో వెస్టిండీస్పై 205 పరుగులు సాధించారు.

No comments:
Post a Comment