హైదరాబాద్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. మాసబ్ ట్యాంక్ శాంతినగర్లోని శ్రీదుర్గా కనుమిల్లి అపార్ట్మెంట్లో బైక్పై వచ్చిన గుర్తు తెలియని దుండగుడు మన్మథ్ దాలియా అనే వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యాడు, గాయపడిన వ్యక్తి కేబీఎస్ బ్యాంకు సీఈవో అని తేలింది.
దుండగుడు ,ఆదివారం మధ్యాహ్నం అపార్ట్మెంట్ వాచ్మెన్ను సంప్రదించి మన్మథ్ ఇంట్లోకి ప్రవేశించాడు. మన్మథ్తో పది నిమిషాల పాటు మాట్లాడిన ఆతను ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మన్మథ్ ను స్థానికులు వెంటనే వైద్యం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి. నోట్ల మార్పిడియే కాల్పులకు కారణమైనట్లు భావిస్తున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.

No comments:
Post a Comment