హైదరాబాద్ దిల్సుఖ్నగర్ 21 ఫిబ్రవరి 2013న జరిగిన జంట పేలుళ్ల ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. ఈ ఐదుగురూ దోషులేనని నిర్ధారించిన కోర్టు ఇవాళ వీరికి శిక్షలను ఖరారు చేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ సహా మొత్తం ఆరుగురు నిందితులుండగా భత్కల్ పరారీలోనే ఉన్నాడు. మొదటిసారిగా ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ కేసు భారత దేశంలో పాల్పడిన ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తయి తీర్పు వెలువడింది ఈ నేపథ్యంలో అత్యంత పటిష్ట బందోబస్తు కోర్టు ఉన్న చర్లపల్లి జైలు వద్ద సోమవారం ఏర్పాటు చేశారు.

No comments:
Post a Comment