గుజరాత్లో రూ.76 లక్షల కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు.మహారాష్ట్రకు చెందిన ఎంహెచ్ 15 ఈపీ 4455 నెంబర్ గల కారును శుక్రవారం సూరత్ పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అందులో రూ.76 లక్షల విలువైన 3,800 కొత్త రూ.2000 నోట్లు బయటపడ్డాయి. ఈ డబ్బును సచిన్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చేందుకు నాసిక్ నుంచి తీసుకొస్తున్నట్లు తేలింది. కారు, డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఓ మహిళతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

No comments:
Post a Comment