Thursday, December 22, 2016

తమిళనాడు కొత్త సీఎస్‌ నియామకం..

తమిళనాడు సీఎస్‌గా ఉన్న రామ్మోహన్‌రావుపై జరిగిన  ఐటీ దాడులు నేపథ్యంలోభారీగా నగదు,ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ   ఆయనపై కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ఆయనను సీఎస్ పదవి నుండి తొలగించింది. కొత్త సీఎస్‌గా గిరిజా వైద్యనాథన్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గిరిజా వైద్యనాథన్‌ ల్యాండ్ సర్వే కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

No comments:

Post a Comment