Sunday, January 15, 2017

కోహ్లీ సేన సంచలన విజయం ....

పూణే లో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య  సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో  భారత్ ఇంగ్లండ్‌పై మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ ఏడు వికెట్ల నష్టానికి  356 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసి భారత్‌కు 351 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. .కోహ్లీకి వన్డే కెప్టెన్సీ తీసుకున్న తర్వాత  ఇది తొలి విజయం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్  కోహ్లీకి , జాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్  రాగా, వీరి భాగస్వామ్యంలో 242 పరుగులు చేశారు. కోహ్లీ 122 పరుగులు(8 ఫోర్లు, 5 సిక్సులు), జాదవ్ 120 పరుగులు(12 ఫోర్లు, 4 సిక్సులు) చేసి ఔటయ్యారు. నాటౌట్‌గా నిలిచిన పాండ్యా 37 బంతుల్లో 40 పరుగులు(3 ఫోర్లు, ఒక సిక్స్) చేశాడు. జనవరి 19న  రెండో వన్డే కటక్ వేదికగా జరగనుంది .

No comments:

Post a Comment